English | Telugu

ఓటు వేయడానికి వచ్చిన కరోనా పాజిటివ్ ఎమ్మెల్యే..

ఈ రోజు దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నిలకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కొన్ని చోట్ల ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో జరుగుతున్న పోలింగ్ లో కరోనా సోకిన ఒక ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి ఓటు వేయడానికి వచ్చారు. అసెంబ్లీ లో పార్టీల బలాబలాలు సమానం గా ఉన్న నేపధ్యం లో ప్రతి ఓటు కూడా విలువైనది కావడం తో తప్పని సరి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ఓటు వేయడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఆ ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి పూర్తి రక్షణ తో వచ్చి ఓటు వేశారు. ఐతే కరోనా పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యే ఓటు వేయడానికి రావడంతో కొంత మంది ఆశ్చర్యా పోగా మరి కొంత మంది ఆందోళనకు గురి అయ్యారు. ఈ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను పోటీలో ఉండడంతో పోలింగ్ తప్పనిసరి అయింది. దీంతో రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.