English | Telugu
ఎన్డీయేలోకి వైసీపీ.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
Updated : Oct 7, 2020
ఇది ఇలా ఉండగా సీఎం జగన్ ను ఎన్డీయేలోకి ఆహ్వానిచినట్లు వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ అధికార వైసీపీతో గానీ ప్రతిపక్ష టీడీపీతో గానీ కలిసే పరిస్థితి లేదని మాధవ్ అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధిష్టానం ఆలోచన చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అయినా జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఎన్డీయేలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతోందని, ప్రభుత్వంలో చేరాలని బీజేపీ అడుగుతోందనే ప్రచారాన్ని వైసీపీనే చేస్తుందనే అనుమానం కలుగుతోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.