English | Telugu
విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులు
Updated : Aug 29, 2020
అంతేకాకుండా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ ను తయారు చేసినట్టు ఆమె తెలిపారు. దీని కోసం రోజుకు కేవలం మూడు గంటల పాటు మాత్రమే డిజిటల్ క్లాసులు ఉండాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా విద్యార్థుల కళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఒక్కో క్లాసును అరగంట నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే నిర్వహించాలని చెప్పింది.
కరోనా కారణంగా విద్యార్థులు చదువు విషయంలో విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర తమ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఆమె కోరారు. అయితే ఇప్పటికీ ఇంట్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని వారికి మరి ప్రభుత్వం ఏవిధంగా సదుపాయాలు సమకూరుస్తుందో వేచి చూడాలి.