English | Telugu
వైరస్ కట్టడికి పకడ్బందీగా పనిచేస్తున్నాం!
Updated : Apr 1, 2020
మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం అందించింది కూడా తెలంగాణనే అని మంత్రి ప్రకటన విడుదల చేశారు.
వెయ్యికి పైగా మంది మర్కజ్ కి వెళ్లినట్లు తెలిసింది. 160 మందిని తప్ప అందరినీ గుర్తించాం. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి, పరీక్షలు చేయిస్తున్నాము అంటే తెలంగాణ ప్రభుత్వం సత్తా, చిత్తశుద్ది అర్దం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పోసిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగెటివ్ వచ్చింది. మరో సారి పరీక్ష చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఈ రోజు మరో ఇద్దరు గాంధీ నుండి డిశ్చార్జ్ అవుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
డిశ్చార్జ్ అయిన వారందరూ మరో 14 రోజులు హోమ్ క్వారంటిన్ లో ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు తెలంగాణ లో 6 గురు కరోనాతో చనిపోయారు.