English | Telugu

కొండపోచమ్మ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఇళ్ళు నేల మట్టం! 

సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా, మరోవైపు హైకోర్టులో స్టే ఉండగానే పోలీసుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా చేస్తున్న అధికారులు. అడ్డుకున్న రైతుల్ని బెదిరిస్తూ పోలీసులతో పక్కకు నెట్టేస్తూ లాక్‌డౌన్‌లోనూ పనులు కొనసాగిస్తున్నారు.

బహిలింపూర్, మామూదాల గ్రామాల్లో కి ప్రజలు వెళ్లకుండా అడ్డంగా కాల్వను తొవ్వుతూ అడ్డుకున్న రైతులను పోలీసులు కెమెరాలతో వీడియో తీస్తూ బెదిరించే ప్రయత్నం చేశార‌ని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

రెండు గ్రామాల పరిధిలోని రైతులకు సంబంధించి న పరిహారం చెల్లించకుండా రైతుల పైనే కేసులు పెడతామని బెదిరింపులు చేస్తున్నారు. ఒకవైపు కారోనాతో రైతులు బెంబేలెత్తిపోతుంటే ఇదే సమయంలో బలవంతంగా పనులు చేస్తే ప్రతిపక్షాలు గానీ ప్రజాసంఘాలు గానీ, రైతులుగానీ అడ్డుకోరని పనులను వేగవంతం చేశారు.

గత వారం రోజులుగా ఈ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోని ఇళ్ళని నేల మట్టం చేశారు. అడ్డుకున్న గ్రామస్థులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌ని స‌త్య‌నారాయ‌ణ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.