English | Telugu

ప్రజలను గాలికి వదిలి సర్కారు నిద్ర పోతోందా.. తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న

తెలంగాణ‌లో క‌రోనా ప‌రీక్ష‌లు, హెల్త్ బులిటెన్ ల ‌లో ప్ర‌భుత్వం అసంపూర్తిగా ఇస్తున్న స‌మాచారంపై తెలంగాణ హైకోర్టు ప్రభుతం పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులపై హైకోర్టు సోమవారం నాడు విచారించింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో క‌రోనా కేసులు ఒక పక్క పెరుగుతుంటే స‌ర్కార్ నిద్ర‌పోతుందా అని ప్రశ్నించింది. టెస్టుల్లో ఏపీ, ఢిల్లీ లతో పోల్చి చూసి తెలంగాణ ఎంతో వెనుక‌బ‌డి ఉంద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో కూడ ఇదే తరహలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాము ఆదేశాలు ఇస్తున్నా ఒక్కటీ కూడ అమలు కావడం లేదని... ఇలా ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. అంతే కాకుండా ప్రభుత్వ కరోనా హెల్త్ బులెటిన్ ను తాము అభినందించినట్టుగా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.