English | Telugu

సొంత గూటికి చేరిన వలస కూలీలు  

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ వలస కూలీలకు స్వాగతం పలికి ఆహ్వానించారు. గుజరాత్ రాష్ట్రం నుండి గరికపాడు చెక్ పోస్ట్ ద్వారా 12 బస్సులలో 887 మంది మత్స్యకారులు చేరుకున్నారు.

శ్రీకాకుళం 700, విజయనగరం 98, విశాఖపట్నం 77, తూర్పుగోదావరి ఐదు మంది, ఒడిశా రాష్ట్రం ఆరు మంది,చత్తీస్గడ్ ఒకరు వున్నారు.
చెక్ పోస్ట్ వద్ద మత్స్యకారులకు అల్పాహారం త్రాగునీరును పోలీసు అధికారులు అందించారు.

లాక్ డౌన్అమలు నేపథ్యంలో రాష్ట్రం నుండి అక్కడకు వెళ్లి, చిక్కుకుపోయిన మత్స్యకారుల సంరక్షణార్థం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మత్స్యకార మంత్రిగారు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పడుతున్న కష్టాలను చూసి గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారని ఎస్పీ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే వైద్య పరీక్షలకు అందరూ సహకరించాలని ఆయ‌న కోరారు. ముఖ్యమంత్రిగారి గారి చొరవ వల్ల అక్కడ చిక్కుకున్న 4400 మందిని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో రాష్ట్రాలను దాటుకుని మొదటి విడతగా 12 బస్సులు వ‌చ్చాయి.

మత్స్యకార కుటుంబాలను వారి వారి ప్రాంతాలకు ఈరోజు సాయంత్రం లోపు పంపించనున్నారు. వారికి ఆహారం, త్రాగు నీరు అందించి, వారి వారి ప్రాంతాలకు పోలీసు బందోబస్తు ఎస్కార్టు ఏర్పాటు చేస్తున్నారు.

వీరిలో ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అవసరం మేరకు వారిని quarantine సెంటర్లకు పంపి వైద్య అందించడం జరుగుతుంది. వారి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉంటే వారిని హౌస్ ఖ్వారంటైంన్ కు పంపిస్తారు.