English | Telugu
కరోనా ఎఫెక్ట్.. ఏకంగా దేశ ప్రధాని పై 900 కోట్లు కట్టాలని ఆ దేశ ప్రజల దావా..
Updated : Dec 24, 2020
దావా వేసిన ప్రజల ముఖ్య ఆరోపణ ఏంటంటే.. కరోనా విజృంభిస్తున్న సమయంలో తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఈనేతలంతా విఫలమయ్యారని కోర్టులో వేసిన దావాలో ఆరోపించారు. ఈ ముగ్గురి నిర్లక్ష్యం కారణంగా తాము అయినవాళ్లను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయానికి దేశ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రితోపాటు గవర్నర్ కూడా పూర్తి బాధ్యత వహించి.. నష్టపరిహారంగా 100 మిలియన్ యూరోలు (సుమారు రూ. 900కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా. ఇటలీలో ఫిబ్రవరి 20న మొట్టమొదటి కరోనా కేసు బయటపడింది. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాలలో ఇటలీ ఐదో స్థానంలో ఉంది.