English | Telugu
మనీలాండరింగ్ కేసు.. అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు
Updated : Jun 27, 2020
వాస్తవానికి జూన్ మొదటి వారంలో విచారణకు హాజరుకావాలంటూ అహ్మద్ పటేల్ కు ఈడీ నటీసులు ఇచ్చింది. అయితే, 65 ఏళ్ల వయోభారంతో పాటు, కరోనా వైరస్ ముప్పు కూడా ఉన్నందున విచారణకు హాజరుకాలేనని పటేల్ చెప్పారు. దీంతో, ఈడీ అధికారులే ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నించారు.
కాగా, ఆంధ్రాబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ రూ. 5 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేసింది. ఆ సంస్థ వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మొత్తం రూ. 8,100 కోట్లుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఆ సంస్థ యజమానులైన నితిన్, చేతన్ సోదరులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారు నైజీరియాలో దాక్కున్నారని సమాచారం. దీంతో, వారిని భారత్ కు రప్పించేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.