English | Telugu
దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు
Updated : Oct 3, 2019
ఢిల్లీ లోకి నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు పోలీసులకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పండుగ సమయాల్లో దాడులు చేసే అవకాశముందని తెలిపాయి. దీంతో ఢిల్లీతో పాటు సరిహద్దు నగరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అటు సాయుధ బలగాలను సైతం భారీగా మోహరించారు. దీని పై ప్రధాని మోదీ అధికారులు సంబంధిత మంత్రులతో చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు తరవాత ఉగ్రవాదులు చెలరేగిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్పటి నుంచి పాకిస్థాన్ సరిహద్దుతో పాటు దేశం లోని స్లీపర్ సెల్స్ కదలికలపై నిఘా పెట్టాయి. అయితే ఇప్పుడు దేశ రాజధానిని టార్గెట్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఉగ్రవాదులు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను టార్గెట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. అంతేకాదు హోంమంత్రిత్వశాఖ దాదాపు ముప్పై నగరాలకు ఉగ్రదాడుల హెచ్చరికలు జారీ చేసింది. ఇక నిఘా వర్గాల హెచ్చరికలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అలర్టైంది. ఎయిర్ ఫోర్స్ బేస్ ల పై దాడులు జరిగే అవకాశముందన్న హెచ్చరికలతో అప్రమత్తమైంది. దీంతో శ్రీనగర్, అవంతిపుర, పఠాన్ కోట్, హైనాన్ ఎయిర్ బేస్ లు దగ్గర గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వైమానికదళం శిబిరాల దగ్గర జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి గత నెల పదవ తేదీ న సివిల్ ఏవియేషన్ బ్యూరోకి వార్నింగ్ లేక కూడా వచ్చింది. దీంతో ఏ చిన్న అవకాశాన్నీ విడవదల్చుకోలేదు అధికారులు.