English | Telugu
భారత్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కు బ్రేక్
Updated : Jul 30, 2020
పూణే, ముంబైలలో 1600 మంది వాలంటీర్ల పై తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని గతంలో సీరం ఇండియా సంస్థ ప్రకటించింది. ఐతే ఇదే విషయమై ఎక్స్పర్ట్స్ కమిటీ మాత్రం కొన్ని మార్పులు చేయాలని కోరినట్టుగా సమాచారం. ట్రయల్స్ కేవలం రెండు నగరాలలో కాకుండా దేశ వ్యాప్తంగా చేయాలనీ దీనితో పాటు వ్యాక్సిన్ ప్రభావం పై మరింత లోతైన విశ్లేషణ కూడా చేయాలనీ దీని కోసం సీరం సంస్థ పంపిన అప్లికేషన్ లో మరో ఎనిమిది మార్పులు చేయాలనీ ఎక్స్పర్ట్ కమిటీ సూచించింది. దీంతో సీరం ఇండియా సంస్థ తమ అభ్యర్ధనలో మార్పులు చేసి మళ్ళీ డిసిజిఐ కి పంపవలసి ఉంది. ఆ అభ్యర్ధనను ఎక్స్పర్ట్స్ కమిటీ (SEC) ఆమోదించిన తరువాత మాత్రమే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. దీంతో భారత్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఆలస్యం కావచ్చని సమాచారం.