English | Telugu

కొల్లు రవీంద్ర రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ ను మరో 14 రోజుల పాటు పొడిగించారు. మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు, వైసీపీ నేతమోకా భాస్కర్ రావు హత్యకేసులో కొల్లు రవీంద్ర నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ఎదుట కొల్లు రవీంద్రను హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వలు ఇచ్చింది.కాగా, ఇప్పటికే కొల్లు రవీంద్ర లాయర్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 20న బెయిల్ పిటిషన్‌ను విచారించనున్నారు.