English | Telugu
తెలంగాణ పై కరోనా పంజా.. పాజిటివ్ కేసులలో కొత్త రికార్డ్
Updated : Jul 3, 2020
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,965 శాంపిల్స్ సేకటించి పరీక్షించారు. వీరిలో 4,073 మందికి నెగెటివ్ రాగా 1,892 మందికి పాజిటివ్ గా తేలింది. ఐతే ప్రైవేట్ ల్యాబ్స్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరి ముఖ్యంగా ఒక ల్యాబ్లో చేసిన టెస్ట్ లలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. దీంతో శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇప్పటివరకు తెలంగాణలో 1,04,118 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.