English | Telugu
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
Updated : Jul 3, 2020
ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అసలు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా రవీంద్రను అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ కక్ష సాధింపునకు దిగుతోందన్నారు. కావాలనే కక్షసాధింపుతో రవీంద్రను ఈ కేసులో ఇరికించారని బాబు ఆరోపించారు. ఎమర్జెన్సీ టైం లో కూడా ఇన్ని అరాచకాలు చూడలేదు. అప్పుడు కూడా ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదని అయన అన్నారు. బీసీల పైన వైసీపీ ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే దీనికి నిదర్శనం అన్నారు.