English | Telugu
కొద్ది వారాల్లో వ్యాక్సిన్ రెడీ.. వారికే తొలి ప్రాధాన్యం
Updated : Dec 4, 2020
వ్యాక్సిన్ ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరుపుతుందని అన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ టీకా ధర నిర్ణయిస్తామని వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు వ్యాక్సిన్ పంపిణీపై ప్రణాళికలు రూపొందిస్తున్నాయని తెలిపారు. కరోనాపై అన్ని రాజకీయ పక్షాలు తమ సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అత్యంత చవకగా, భద్రమైన టీకా భారత్ నుంచి వస్తుందని తక్కిన ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.