English | Telugu
15లోగా గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి సిద్ధం!
Updated : Apr 7, 2020
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రి పనులను పరిశీలించారు.
15 అంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో దాదాపు 1500 పడకలు అందుబాటులోకి రానున్నాయి. పనులు వేగవంతం చేసి ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయనున్నారు. రోజుకు దాదాపు వెయ్యి మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది.