English | Telugu

ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో కేసులు!!

సీనియర్ నటి ఖుష్బూ సుందర్‌ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆమె బీజేపీలో చేరుతూ కాంగ్రెస్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లంతా మానసింక వికలాంగులే.. అటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఖుష్బూకు తలనొప్పిగా మారాయి.

ఖుష్బూ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు అన్నారు. కాంగ్రెస్ పై ఆమెకు ఏదైనా కోపం ఉంటే మరోలా విమర్శించుకోవాలని, మధ్యలో తమను కించపరిచే మాటలు ఎందుకు? అంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఖుష్బూ క్షమాపణలు చెప్పారు. అయితే, ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ, కొందరు ఆమెపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఖుష్బూ చెప్పిన క్షమాపణలను తాము అంగీకరించబోమని, ఆమె చట్టాన్ని ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో తొందరపాటు వ్యాఖ్యలు ఖుష్బూకి చిక్కులు తెచ్చి పెట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.