English | Telugu

అరెస్ట్ లేదు, ఒక్క ఆస్తిని జప్తు చేయలేదు సీఎం ఎక్కడ ఉన్నారు?: చంద్రబాబు ట్వీట్‌

సీఎం జగన్ ఎక్కడ ఉన్నారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఎల్జీ గ్యాస్‌ ప్రమాద బాధితుల కష్టాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. విశాఖ వాసులు రోడ్లపై నిద్రిస్తున్నారని, మృతుల బంధువులు శవాల పక్కన రోధిస్తున్నారని చెప్పారు. ఎల్జీ కంపెనీ పరిసర గ్రామస్తులు న్యాయం కోసం పోరాడుతున్నారని, ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ చేయలేదని, ఆస్తులు స్వాధీనం చేసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

జరిగిన దుర్ఘటనతో భయకంపితులైన విశాఖ ప్రజలు రోడ్లపైనే పడుకుంటున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారని, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు తమవారి మృతదేహాల పక్కన దీనంగా రోదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదని, ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడున్నాడు? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.