English | Telugu
హైకోర్టు జడ్జిలపై అసభ్యకర కామెంట్స్.. ఎట్టకేలకు రంగంలోకి దిగిన సీబీఐ
Updated : Nov 16, 2020
ఇది ఇలా ఉండగా హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన 17 మందిపై హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించాలంటూ సీబీఐని ఆదేశించింది. దీంతో సీబీఐ విశాఖలో తాజాగా 12 కేసులను రిజిస్టర్ చేసింది. ఈ కేసుల్లో డి. కొండారెడ్డి, ఎ.మణి, గౌతమీ, పి.సుధీర్, ఆదర్శరెడ్డి, అభిషేక్ రెడ్డి, శివారెడ్డి, ఎ.శ్రీధర్ రెడ్డి, జె.వెంకట సత్యనారాయణ. జి. శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి, చందూరెడ్డి, శ్రీనాధ్, డి.కిషోర్ రెడ్డి, చిరంజీవి, ఎల్. రాజశేఖర్ రెడ్డిల పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.