English | Telugu

భయం ఇంకా పోలేదు... సాగర్ లాంచీ ప్రయాణానికి మొగ్గు చూపని పర్యాటకులు

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణానికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతులు ఇవ్వడంతో లాంచీ ప్రయాణం నడపడానికి సిద్ధమయ్యారు టూరిజం అధికారులు. కనీసం వంద మంది ప్రయాణికులు ప్రయాణించవలసిన లాంచిలో 34 మంది ప్రయాణికులు మాత్రమే పర్యటనకు ఆసక్తి చూపడంతో ట్రిప్ ని నిలిపివేశారు. శ్రీశైలంకు లాంచీని ప్రతి సంవత్సరం నడుపుతారు అధికారులు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు వెళ్లడానికి పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు ఆరు గంటల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో పర్యాటకులు చాలా ఇష్టపడతారు. గతంలో వారానికి రెండు సార్లు ఈ లాంచీ ప్రయాణం ఉండేది. కానీ ఈ సంవత్సరం పర్యాటకులు బయలుదేరవలసిన శ్రీశైలం లాంచిని రద్దు చేశారు. లాంచీ టూరుకు కచ్చులూరు ప్రమాదం ఎఫెక్టే ఉండవచ్చని స్థానికులు అనుకుంటున్నారు. పర్యాటకులు ఆసక్తి చూపక పోవడం.. ఆన్ లైన్ లో విక్రయించాల్సిన టిక్కెట్ లు అమ్ముడు పోకపోవడంతో లాంచీని రద్దు చేశారు. ఇటీవల కచ్చులూరు లాంచీ ప్రమాదంతో ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా నాగార్జున సాగర్ లో లాంచీ ప్రయాణాలు నిలిపివేశారు.ప్రయాణికులు కూడా కచ్చులూరు ప్రమాదం తరువాత లాంచీ ప్రయాణాలు అంటే ఒక అడుగు వెనుక్కు తగ్గుతున్నారు అనేది వాస్తవం.టూరిజం అధికారులు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు పాటించడం లేదని అందుకే సగం ప్రయాణికులు ఆశక్తి చూపించడం లేదని వెల్లడించారు.