English | Telugu
కరోనాతో మరో ఎంపీ కన్నుమూత
Updated : Sep 17, 2020
కర్ణాటక రాయచూర్కు చెందిన అశోక్ గస్తీ విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్ లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ ఏడాది జూన్లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక నుంచి రాజ్యసభకు అశోక్ గస్తీ తొలిసారి ఎన్నికయ్యారు. జులై 22న ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, రాజ్యసభకు ఎన్నికైన మూడు నెలలలోపే, ఒక్కసారి కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే ఆయన కన్నుమూశారు.