English | Telugu
వైసీపీకి షాక్.. ఎంపీ నందిగం సురేష్ పై రఘురామరాజు ప్రివిలేజ్ నోటిస్
Updated : Sep 17, 2020
ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన నందిగం సురేశ్ ఎంపీ రఘురామరాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎంపీల గురించి, అలాగే తమ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిచ్చివాగుడు వాగితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని రఘురామరాజునుద్దేశించి సురేశ్ హెచ్చరించారు. రఘురామరాజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కూడా సురేష్ ఈ సంసంర్భంగా వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తే నాలుగు ఓట్లు కూడా రావని రఘురామరాజు అంటున్నారని... అయితే ఢిల్లీలో గలీజు పనులు, మోసగాడు, చీటర్ లాంటి పదవులకు పోటీ పడితే ఎంపీల ఓట్లన్నీ ఆయనకే పడతాయని సురేష్ ఎద్దేవా చేశారు. తాజాగా సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై రఘురామరాజు ప్రివిలేజ్ నోటిస్ ఇచ్చారు.