English | Telugu

దత్తాత్రేయ కారుకు ప్రమాదం! తప్పిన పెను గండం 

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. తృటిలో ఆయన పెద్ద గండం నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళుతున్న బండారు దత్తాత్రేయ వాహనం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద అదుపుతప్పి రోడ్ పక్కకు వెళ్లిపోయింది. రన్నింగ్ లోనే ఒక్కసారిగా కార్ స్టీరింగ్ లాక్ అవ్వడంతో ఎడమవైపు రోడ్ పక్కకు కారు దూసుకెళ్లింది. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో భారీ ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

కారు ఎడమ వైపును దూసుకువెళ్లడంతో అంతా బయపడ్జారు. డ్రైవర్ కారును సేఫ్ గా ఆపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు. ఘటనాస్థిలికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు.. దత్తాత్రేయను మరో కారులో నల్గొండకు పంపించారు .నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళుతుండగా దత్తాత్రేయ కారుకు ఈ ప్రమాదం జరిగింది.

బండారు దత్తాత్రేయ వాహనం ప్రమాదానికి గురైందన్న సమాచారంతో రాష్ట్ర బీజేపీ నేతలు, ఆయన అభిమానులు కలవరానికి గురయ్యారు. అయితే ప్రమాదం ఏమి లేదని తెలియడంతో కూల్ అయ్యారు. దత్తాత్రేయ కారు ప్రమాదానికి గురైన ప్రాంతానికి సమీపంలోనే కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాహనం ప్రమాదానికి గురైంది.