English | Telugu
కరోనా దెబ్బకు ఏపీలో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా
Updated : Mar 15, 2020
గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ఆదేశం
పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం కారణం గా ,సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని, ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల, ఎస్పీలనును విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశించింది. మాచర్ల ఘటనలో సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని, కొంతమంది పోలీసు అధికారులపై చర్యలకు ఈసి ఆదేశించింది. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, తిరుపతి, పలమనేరు, తాడిపత్రి రాయదుర్గం సిఐలను బదిలీ చేయాలని కూడా ఆదేశించింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరమైతే ఎన్నికలను రద్దుచేసేందుకు పరిశీలించాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మహిళా అభ్యర్దులు, బీసీ అభ్యర్దులను ఇబ్బంది పెట్టారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆరు వారాల తర్వాత దీనిపై క చ్చితంగా ఓ నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.