English | Telugu

టీడీపీ నేత అచ్చన్నాయుడికి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు 

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఈరోజు కొట్టేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్ కుమార్, పితాని పీఏ మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. కేసుకు సంబంధించి రెండు పక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఏసీబీ వాదనతో ఏకీభవించింది. ఈ కేసుకు సంబంధించిన ఇంకా అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉన్నందువల్ల.. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని హైకోర్టుకు వివరించింది. దీంతో అచ్చెన్నాయుడు సహా మరికొందరి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా విషయం తెలిసిందే.