English | Telugu

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించనుంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న మంత్రివర్గ విస్తరణ కోసం సమావేశమవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 22 తేదీన మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే రోజున ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయిన విషయం తెలిసిందే.