English | Telugu
భారత్- చైనా సరిహద్దు ఘర్షణలో భారీ ప్రాణ నష్టం
Updated : Jun 17, 2020
సరిహద్దులో చైనాతో తలెత్తిన ఘర్షణపై భారత ప్రభుత్వం స్పందించింది. తామెప్పుడూ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ని అతిక్రమించలేదని, తమ కార్యకలాపాలు ఎప్పుడూ దాని పరిధిలోనే జరిగాయని స్పష్టం చేసింది. ఎల్ఏసీ ని గౌరవిస్తూ చైనా బలగాలు సాఫీగా వెనక్కు వెళ్తాయని భావించినట్లు తెలిపింది.
మరోవైపు ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. తదుపరి కార్యాచరణ పై సమాలోచనలు జరుపుతున్నారు.