English | Telugu

కరోనా వైరస్ ప్రభావం... తాత్కాలికంగా ఇంద్రకీలాద్రి దర్శనాలు బంద్.

తాత్కాలికంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలనుండి దర్గగుడి దర్శనాలు నిలిపివేత, అలాగే ఘాట్ రోడ్ మూసివేస్తున్నట్టు ఆలయ కార్య నిర్వహణాధికారి సురేష్ బాబు తెలిపారు. ఈ నెల 31 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆలయ కమిటీ, ఈవో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పూజలు,హోమాలు,నివేదనలు ఏకాంతంగా యధావిధిగా జరుగుతాయి. భక్తులు అందరూ సహకరించాలని ఈవో సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.