English | Telugu

గన్నవరం వైసీపీలో ఘర్షణ... వెంకట్రావు వర్గీయులపై వంశీ వర్గం దాడి

గన్నవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తరువాతి కాలంలో సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన దగ్గరి నుండి నియోజకవర్గంలోని ఆ పార్టీ గ్రూఫుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీకి చెందిన చిన్న అవుటపల్లి మాజీ సర్పంచి కోట వినయ్ తో పాటు మరి కొందరు వైసీపీ కార్యకర్తలపై.. ఎమ్యెల్యే వంశీ అనుచరుల దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటన పై బాధితులు ఆత్కురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వంశీ పై పోటీ చేసి.. ప్రస్తుతం KDCC చైర్మన్ గా ఉన్న యార్లగడ్డ వెంకటరావు పోలీస్ ‌స్టేషన్‌కి వచ్చి.. బాధితులకు తాను అండగా ఉంటాననీ, అందుకోసమే పోలీస్ ‌స్టేషన్‌కి వచ్చానని అన్నారు. అంతేకాకుండా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఐతే దీని పై పోలీసులు స్పందిస్తూ.. ఘటన పై దర్యాప్తు చేసి... చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.