English | Telugu

మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా వైరస్ అటు సామాన్యులనే కాక ఇటు విఐపిలను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకింది. ఈ సంగతిని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనలో కొన్నికొద్దీ రోజులుగా స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని.. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన ఆ ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అయితే కొద్దిరోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని అయన కోరారు.