English | Telugu
బంగ్లాదేశ్ బాలికలతో వ్యభిచారం.. 21 మంది అమ్మాయిలకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి...
Updated : Dec 12, 2020
బాలికలను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చి వారికి డ్రగ్స్ ఇచ్చి వారితో వ్యభిచారం చేయించారని సీఎం తెలిపారు. ఈ ముఠాలో నైజీరియా డ్రగ్ రాకెట్ పాత్ర కూడా ఉందని చెప్పారు. తమ రాష్ట్ర పోలీసు బృందం గుజరాత్ తోపాటు ఇతర రాష్ట్రాలను కూడా సందర్శించి దర్యాప్తు చేసిందని తెలిపారు. ఇండోర్ లో కొందరు జిమ్ ట్రైనర్స్ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని గుర్తించినట్లు చెప్పారు. జిమ్ ట్రైనర్స్ యువకులకు డ్రగ్స్ ను అలవాటు చేశారని సీఎం పేర్కొన్నారు.