English | Telugu
లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేని విమాన ప్రయాణికులకు శుభవార్త
Updated : Sep 7, 2020
లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేనివారి తరపున ప్రవాసీ లీగర్ సెల్ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ విషయంపై సమాధానం చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకున్నవారికి విమానయాన సంస్థలు కనుక రిఫండ్ ఇవ్వకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అదే టికెట్పై మరోమారు ప్రయాణించే అవకాశం (క్రెడిట్ షెల్) లభిస్తుందని కేంద్రం వివరించింది. క్రెడిట్ షెల్ వినియోగించుకోని ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్ ఇస్తుందని అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. విమాన ప్రయాణికులు తమ టికెట్ను వేరేవారికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. దీంతో కరోనా సమయంలో ప్రయాణం చేయలేకపోయిన వారికి కాస్త ఊరట కలిగింది.