English | Telugu
కొత్త పార్లమెంట్ జాతికే గర్వ కారణం! ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ
Updated : Dec 9, 2020
పార్లమెంట్ కోసం కొత్తగా నిర్మించనున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్కు చెందిన హెచ్సీపీ డిజైన్స్ సంస్థ ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటుగా వ్యవహరిస్తోంది. 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాజెక్ట్ కోసం గుజరాత్కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది. ఇందులో భాగంగా త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు ఉండే మూడు కిలోమీటర్ల రాజ్పథ్ను పునరుద్ధరిస్తారు.