English | Telugu
కరోనా నేపధ్యంలో ఏపీలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన రవాణాశాఖ
Updated : Apr 24, 2020
గూడ్స్ వాహనాల ఇబ్బంది ఉంటే రాష్ట్ర కంట్రోల్ రూం ని సంప్రదించాలని, లారీ ఓనర్స్ తో సమావేశం అయ్యి వారికి అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. హైవే పై ట్రక్ రిపేర్ షాపులు, డాబాలు, లేబర్ ట్రాన్స్పోర్ట్ లాంటి అంశాలు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని 1 శాతం హైపో క్లోరైట్ సొల్యూషన్ తో సాటిటైజ్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ అందిస్తామని కూడా వారు చెప్పారు.