English | Telugu
49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర! గతంలో కంటే బెటర్
Updated : Nov 26, 2020
కేపీహెచ్బీ కాలనీ డివిజన్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రీతం కుమార్ రెడ్డిపై అత్యధికంగా 9 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత షాలిబండ 48 వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్ధి మహ్మద్ ముస్తఫా అలీపైన 7 కేసులు ఉన్నాయి. మారెడ్పల్లి వార్డు బీజేపీ అభ్యర్థి టి. శ్రీనివాస్ రెడ్డిపై 5 కేసులు, మోండా మార్కెట్ నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన ఆకుల రూపపైన 5 కేసులు ఉన్నాయని ఎఫ్జీజీ వెల్లడించింది. మిగతా వారిలో కొందరిపై నాలుగు, మరికొందరిపై మూడు, రెండు కేసులు ఉండగా చాలా మంది అభ్యర్ధులు కేవలం ఒకే కేసులో నిందితులుగా ఉన్నారు.
గత గ్రేటర్ ఎన్నికల్లో 72 మంది నేరచరితులకు వివిధ పార్టీలు టికెట్లు ఇవ్వగా ఈ సారి 49 మందే ఉన్నారు. పోటీ చేస్తున్న వారిలో నేర చరిత్ర ఉన్న వారు తగ్గడం శుభపరిణామని పద్మనాభరెడ్డి చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్లో నేరమయ రాజకీయాలు తగ్గిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసి తమకు అవసరమైన వారిని ఎన్నుకోవాలని పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు.