Read more!

English | Telugu

ఈసారి ఎన్టీఆర్ కుమ్మేస్తాడా ?

 

"ఆంధ్రావాలా" చిత్రం తర్వాత దాదాపు 10సంవత్సరాల విరామం తీసుకొని ఈసారి ఎలాగైనా టాలీవుడ్ లో తమ సత్తా ఏంటో చూపించడానికి ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా ఓ చిత్రం రుపొందబోతుంది. ఎన్టీఆర్ కోసం పూరీ ఓ కమర్షియల్, మాస్ కథను సిద్ధం చేసాడట. ఈ చిత్రానికి "కుమ్మేస్తా" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.

పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కు ఈ చిత్రం విజయం సాధించడం ఎంతో ముఖ్యం. పూరీ కూడా ఈ సినిమాను ఎలాగైనా ఒక బ్లాక్ బస్టర్ హిట్టుగా తెరకెక్కించాలనే కసితో ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.