English | Telugu
లతా మంగేష్కర్ వందల కోట్ల ఆస్తికి వారసులెవరు?
Updated : Feb 8, 2022
గానకోకిల లతా మంగేష్కర్ కరోనా మహమ్మారితో హాస్పిటల్ పాలై, 92 సంవత్సరాల పండు వయసులో ఫిబ్రవరి 6న కన్నుమూసి, కోట్లాదిమంది అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు. 1942లో గాయనిగా కెరీర్లో ఆరంభించిన లత, 'మహల్' మూవీలో పాడిన "ఆయేగా ఆనే వాలా" పాటతో పాపులారిటీ దక్కించుకున్నారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ప్రపంచవ్యాప్తంగా 36 భాషల్లో 50 వేలకు మించి పాటలు పాడారు లత. ఈ సందర్భంగా ఆమె ఎంతో సంపదను కూడబెట్టారు. ఒక అంచనా ప్రకారం లతా మంగేష్కర్ నికర ఆస్తుల విలువ 50 మిలియన్ డాలర్లు. అంటే, రూ. 368 కోట్లు! తను పాడిన పాటలకు సంబంధించిన రాయల్టీల ద్వారా, ఇతర పెట్టుబడుల ద్వారా ఆమెకు ఈ ఆస్తులు సమకూడాయి. Also read: హృతిక్ కొత్త గాళ్ఫ్రెండ్ ఇదివరకు మరొకరితో సహజీవనంలో ఉంది!
తొలి పాటకు ఆమె అందుకున్న పారితోషికం రూ. 25. అలాంటి ఆమె చనిపోయేనాటికి వందల కోట్లు విలువ చేసే ఆస్తులకు యజమాని అయ్యారు. మరణించే నాటికి ఆమె నెల సంపాదన రూ. 40 లక్షలు పైనే. వార్షికాదాయం రూ. 5 కోట్లు. తన కెరీర్లో ఆమె శ్రమించిన తీరుకు ఫలితమే ఈ సంపాదన. Also read: ఓటీటీలో రిలీజైతే కలెక్షన్లు రావనే అభిప్రాయాన్ని తుత్తునియలు చేసిన 'పుష్ప'
సౌత్ ముంబైలోని పెద్దర్ రోడ్లో లతకు ప్రభు కుంజ్ భవన్ అనే పేరుతో భవనం ఉంది. అక్కడే ఆమె నివాసం ఉన్నారు. ఆ భవనం కొన్ని కోట్ల రూపాయల విలువు చేస్తుందంటున్నారు. ఆమె దగ్గర చెవర్లెట్, బూయిక్, క్రిస్లర్ కార్లున్నాయి. 'వీర్ జారా' పాటను పాడాక, ఆమెకు డైరెక్టర్ యశ్ చోప్రా ఒక మెర్సిడెస్ బెంజ్ను బహూకరించారు. కడదాకా అవివాహితగా జీవించారు లత. ఈ నేపథ్యంలో, ఆమె కోట్లాది రూపాయల ఆస్తులకు వారసులెవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆమెకు చెల్లెల్లు, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు హృదయ్నాథ్ మంగేష్కర్కు ఆమె ఆస్తులు దక్కనున్నాయని వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.