Read more!

English | Telugu

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ శవం దగ్గరికి అందుకే వెళ్ళలేదంటున్న సుశాంత్ లవర్

2020 వ సంవత్సరం భారతీయ చిత్రపరిశ్రమ మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేసింది.ఆ సంవత్సరమే హిందీ చిత్రసీమలో ఎంతో భవిష్యత్తు ఉన్ననటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు తాజాగా సుశాంత్ లవర్ అంకిత లోఖండే చెప్పిన ఒక విషయంతో అందరు మరోసారి సుశాంత్ సూసైడ్ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

అంకిత లోఖండే ప్రెజంట్ బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 17 లో కంటెస్ట్ గా ఉంది. ఈ షోలో పాల్గొన్న మరో కంటెస్ట్ తో  సుశాంత్  అంత్యక్రియలకి సంబంధించినప్పుడు జరిగిన ఒక విషయాన్ని అంకిత షేర్ చేసుకుంది. సుశాంత్ మరణం నన్ను చాలా తీవ్రంగా కలిచివేసింది.అసలు నా జీవితంలో సుశాంత్ లాంటి  మంచి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. సుశాంత్ చనిపోయినప్పుడు నేను అంత్యక్రియలకి వెళ్లలేదని చాలా మంది అనుకున్నారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే సుశాంత్ ని అలా నిర్జీవంగా  చూసి నేను తట్టుకోలేను.అందుకే అంత్యక్రియలకి వెళ్లలేదని అంకిత చెప్పింది.

టెలివిజన్ రంగం నుంచి సినిమా రంగంలోకి వెళ్లిన సుశాంత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తక్కువ వ్యవధిలోనే బాలీవుడ్ లో తనదైన ముద్రవేసాడు. కానీ హఠాత్తుగా తీసుకున్న సూసైడ్ నిర్ణయంతో ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళాడు.