English | Telugu
పిల్లలు ఫుల్ డ్రస్లో ఉన్నారు, మరి అమ్మేంటి ఇలా!.. మీరా రాజ్పుత్పై నెటిజన్స్ ట్రోలింగ్!
Updated : Oct 24, 2021
బాలీవుడ్ స్టార్ యాక్టర్ షాహిద్ కపూర్ ఢిల్లీకి చెందిన మీరా రాజ్పుత్ను 2015 జూలై 7న పెళ్లి చేసుకున్నాడు. క్రమక్రమంగా మీరా మిలియన్ల ఫాలోయర్స్తో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. అంతమంది ఆమెను ప్రేమించడానికి ఆమె ఫ్యాషన్ గేమ్, ఆమె హంబుల్ నేచర్ కారణమని అంటుంటారు. ఒకవైపు ఇంతగా అభిమానుల ప్రేమను చూరగొన్న ఆమె, మరోవైపు ఏదో ఒక కారణంతో దారుణంగా ట్రోల్కు గురవుతుండటం మనం చూడొచ్చు.
26 వయసుకు ఇద్దరు పిల్లల తల్లయింది మీరా. 2016 ఆగస్ట్ 26న షాహిద్, మీరా దంపతులకు మిష అనే కూతురు పుట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు 2018 సెప్టెంబర్ 5న రెండో సంతానంగా జైన్ జన్మించాడు. కొద్ది రోజుల క్రితం ఈ నలుగురి ఫ్యామిలీ మాల్దీవుల విహారానికి వెళ్లింది. ఇప్పుడు తిరిగి ముంబైకి వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్లో మీరా లుక్ చూసి చాలామంది నెటిజన్స్ పెదవి విరిచారు.
అక్టోబర్ 22న భార్య మీరా, పిల్లలు మిష, జైన్లతో ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించాడు షాహిద్ కపూర్. అతను బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించగా, మీరా బ్లాక్ స్వెట్షర్ట్, దానికి మ్యాచింగ్ బ్లాక్ డెనిమ్ షార్ట్స్ ధరించి దర్శనమిచ్చింది. ఇద్దరు పిల్లలు కింద నుంచి పైదాకా ఫుల్ డ్రస్తో కనిపించారు. వాళ్ల ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాక మీరా ధరించిన దుస్తులపై నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టేశారు.
మీరా తన కుమార్తె మిషా చేయి పట్టుకొని కారువైపు నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె ధరించిన దుస్తులు నెటిజన్లను ఇబ్బందిపెట్టాయి. ఒక యూజర్ అన్యాపదేశంగా మీరాను తప్పుపడుతూ, "పురుషులపై నా గౌరవం రోజు రోజుకూ పెరుగుతోంది. కనీసం వారు పూర్తిగా దుస్తులు ధరించి తమను తాము గౌరవించుకుంటున్నారు, ప్రత్యేకించి పబ్లిక్ ప్రదేశాల్లో" అనే కామెంట్ పెట్టాడు. అంటే మీరా కురుచ దుస్తులు ధరించి, గౌరవాన్ని పోగొట్టుకుందని చెప్పడమే. ఇంకో యూజర్, "పిల్లలు ఫుల్ డ్రస్ వేసుకున్నారు, అమ్మ మాత్రం వేసుకోలేదు" అని కామెంట్ చేశారు. ఇంకొకరు, "వీళ్లు చిన్నప్పటి రోజుల్లోకి వెళ్లిపోతున్నారా?" అని ఆశ్చర్యం ప్రకటించారు.