English | Telugu
సేమ్ ఇయర్.. నాగ్ రి-ఎంట్రీ, చైతూ ఎంట్రీ!
Updated : Dec 19, 2021
తెలుగునాట స్టార్ హీరోగా రాణించిన కింగ్ నాగార్జున.. బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు. `శివ`, `ఖుదాగవా`, `ద్రోహి`, `క్రిమినల్`, `మిస్టర్ బేచారా`, `అంగారే`, `జఖ్మ్`, `అగ్నివర్ష`, `ఎల్.ఓ.సి. కార్గిల్` వంటి హిందీ చిత్రాల్లో తనదైన అభినయంతో మెప్పించారాయన. కట్ చేస్తే.. దాదాపు 19 ఏళ్ళ తరువాత నాగ్.. బాలీవుడ్ లో రి-ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు నాగార్జున. ట్రయాలజీగా రూపొందుతున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్ పార్ట్ `శివ` వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 9న రిలీజ్ కి రెడీ అయ్యింది.
Also Read:క్రేజీ కాంబినేషన్.. రాజమౌళి దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్!
మరోవైపు.. నాగ్ తనయుడు నాగచైతన్య కూడా నెక్స్ట్ ఇయర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమానే.. `లాల్ సింగ్ చద్ధా`. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా.. ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రాబోతోంది. సో.. ఒకే ఏడాదిలో దాదాపు 5 నెలల వ్యవధిలో హిందీనాట చైతూ ఎంట్రీ, నాగ్ రి-ఎంట్రీ ఉండబోతోందన్నమాట. మరి.. అక్కినేని తండ్రీతనయులు ఆయా చిత్రాలతో ఎలాంటి ఫలితాలను, గుర్తింపును పొందుతారో చూడాలి.