English | Telugu

సీక్వెల్ బాట‌లో `పీకే`

బాలీవుడ్ లో అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపు పొందారు రాజ్ కుమార్ హిరాణి. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్`, `ల‌గే ర‌హే మున్నా భాయ్`. `త్రీ ఇడియ‌ట్స్`, `పీకే`, `సంజు`.. ఇలా ఈ వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించడ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందాయి.

ఇదిలా ఉంటే.. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్`కీ సీక్వెల్ గా `ల‌గే ర‌హే మున్నాభాయ్`ని రూపొందించిన రాజ్ కుమార్.. త్వ‌ర‌లో `పీకే`కి కొన‌సాగింపుగా మ‌రో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే `పీకే`లో ప్ర‌ధాన పాత్ర పోషించిన అమీర్ ఖాన్ కాకుండా.. సినిమా చివ‌ర‌లో త‌ళుక్కున మెరిసిన ర‌ణ్ బీర్ క‌పూర్ తో ఈ సైన్స్ ఫిక్ష‌న్ సెటైరికల్ కామెడీ డ్రామా కొన‌సాగింపుని చేయ‌బోతున్నార‌ట రాజ్ కుమార్. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్.

కాగా, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబినేష‌న్ లోనూ రాజ్ కుమార్ హిరాణి ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నున్నార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. `పీకే` సీక్వెల్ కంటే ముందే ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌ట‌.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.