English | Telugu
సరోగసీ ద్వారా కవలలను కన్న ప్రీతీ జింటా!
Updated : Nov 18, 2021
బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా, ఆమె భర్త జీన్ గుడెనఫ్ ఇద్దరు కవల పిల్లకు తల్లితండ్రులయ్యారు. పేరెంట్స్గా మారడానికి వారు సరోగసీని ఎంచుకున్నారు. తమ పిల్లల పేర్లను ప్రీతి వెల్లడించారు. అబ్బాయికి జై జింటా గుడెనఫ్ అనీ, అమ్మాయికి జియా జింటా గుడెనఫ్ అనీ పేర్లు పెట్టినట్లు ఆమె చెప్పారు. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పోస్ట్లో, "అందరికీ హాయ్.. ఈరోజు మీ అందరికీ మాకు సంబంధించిన అమేజింగ్ న్యూస్ను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జీన్, నేను అమితానందంలో ఉన్నాం. మా హృదయాలు చాలా కృతజ్ఞతతో, చాలా ప్రేమతో నిండిపోయాయి. మా ఫ్యామిలీలోకి మా కవలలు జై జింటా గుడెనఫ్, జియా జింటా గుడెనఫ్ వచ్చారు. మా జీవితాల్లో ఈ కొత్త దశ గురించి చాలా ఎగ్జయిట్ అవుతున్నాం" అని రాసుకొచ్చింది.
ఈ ప్రెగ్నెన్సీ అంశంలో పాలుపంచుకున్న వారికి, "సరోగసీ ద్వారా పిల్లలను కనాలనే మా ఇన్క్రెడిబుల్ జర్నీలో భాగం పంచుకున్న డాక్టర్లకు, నర్సులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లోడ్స్ ఆఫ్ లవ్ అండ్ లైట్ - జీన్, ప్రీతి, జై, జియా." అని ఆమె థాంక్స్ చెప్పింది.
2016లో జీన్ గుడెనఫ్ను పెళ్లి చేసుకున్న ప్రీతి, ఆ తర్వాత లాస్ ఏంజెల్స్కు తన మకాం మార్చింది. ప్రీతి కంటే ముందు కరణ్ జోహార్, షారుక్ ఖాన్, ఏక్తా కపూర్, ఆమిర్ కాన్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారు.