Read more!

English | Telugu

'ఆదిపురుష్' 20 వేల థియేట‌ర్ల‌లో రిలీజ‌వ‌నుందా?

 

ప్ర‌భాస్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఫిల్మ్ 'ఆదిపురుష్‌'. రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో శ్రీ‌రామునిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా, సీత పాత్ర‌ను కృతి స‌న‌న్ చేస్తోంది. రావ‌ణాసురునిగా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నాడు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మాణ‌మ‌వుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప‌లు భార‌తీయ భాష‌ల‌తో పాటు జ‌ప‌నీస్‌, చైనీస్ లాంటి విదేశీ భాష‌ల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

Also read: 'సారంగ దరియా' పాటకు మరింత అందం తీసుకొచ్చిన 'లయ'!

హిందీ, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో ఈ సినిమాని టి-సిరీస్‌, రెట్రోఫిలిస్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. దేశంలోని అత్య‌ధిక బ‌డ్జెట్‌తో త‌యారైన సినిమాల్లో ఒక‌టిగా రూ. 450 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా త‌యార‌వుతోంది. ఇదివ‌ర‌కు ఈ సినిమాని పాన్ ఇండియా ఫిల్మ్‌గా పిలిచారు కానీ, ఇప్పుడు దీన్ని పాన్‌-వ‌ర‌ల్డ్ మూవీగా అభిమానులు అభివ‌ర్ణిస్తున్నారు. అందుకు అనుగుణంగానే 'ఆదిపురుష్‌'ను వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఏకంగా 20 వేల థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు సంక‌ల్పించిన‌ట్లు స‌మాచారం. అదే జ‌రిగితే, ఇన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యే తొలి భార‌తీయ సినిమాగా 'ఆదిపురుష్' నిల‌వ‌నుంది.

Also read: షాహిద్ క‌పూర్ పేరుతో విసిగిపోయిన‌ విద్యా బాల‌న్‌!

రెండు భాగాల 'బాహుబ‌లి' సినిమాతో వ‌చ్చిన మ‌హా క్రేజ్‌తో దేశ‌వ్యాప్తంగానే కాకుండా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌. త్వ‌ర‌లో ఆయ‌న తెలుగు సినిమా 'రాధే శ్యామ్' ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.