Read more!

English | Telugu

ఇచ్చిన మాటని నిలబెట్టుకోబోతున్న షారుక్ ఖాన్ 

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా గత ఏడాది రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన మూవీ పఠాన్. వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సాధించిన  ఆ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులని కూడా క్రియేట్ చేసింది. చాలా సిటీస్ లోని మూవీ లవర్స్ సినిమా సూపర్ గా ఉందంటూ  తమ  కాలనీ వాళ్ళకి పఠాన్ టికెట్స్ ని  కూడా ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్  న్యూస్ ఒకటి పఠాన్ ప్రియుల్లో ఆనందాన్ని నింపుతుంది.
    
పఠాన్ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతుంది. మేకర్స్ అందుకు  సంబంధించిన పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. ఈ ఏడాది చివరలోనే  స్టార్ట్ చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. పఠాన్ రిలీజ్ టైం లోనే పార్ట్ 2  కూడా  ఉంటుందని మేకర్స్  చెప్పారు. అప్పటినుంచి పఠాన్ 2  ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని షారుక్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తు ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడొస్తున్న వార్తలపై వాళ్లంతా హ్యాపీగా ఉన్నారు. 


షారుక్ తో దీపికా పదుకునే జత కట్టిన పఠాన్ షారుక్ ని వరుస పరాజయాల బాట నుంచి బయటపడెయ్యడమే కాకుండా   హిందీ చిత్ర సీమకి సరికొత్త ఊపిరిని కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. 240 కోట్లతో నిర్మాణం జరుపుకున్న పఠాన్  1000 కోట్లు పైగా వసులు చేసింది. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకుడుగా వ్యవహరించగా యష్ రాజ్ ఫిల్మ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించాడు. జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా,అశుతోష్ రానాలు కీలక పాత్రల్లో నటించారు.