English | Telugu
కంగన ఎమర్జెన్సీ కోసం వెయిట్ చేస్తున్న కరణ్!
Updated : Aug 23, 2023
కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు కరణ్ జోహార్. ఈ మాటలు విన్న వారందరూ ఏ ఇద్దరి మధ్యా పరస్పర వైరం, పరస్పర స్నేహం ఉండదు అని అంటున్నారు. తన మణికర్ణిక ఫిలిమ్స్ పతాకంపై ఎమర్జెన్సీని రూపొందిస్తున్నారు కంగనా రనౌత్. ఈ సినిమాను నిర్మించడం కోసం ఆస్తులన్నీ తాకట్టుపెట్టానని కూడా ఆ మధ్య చెప్పారు కంగనా రనౌత్. కంగనకి, కరణ్ జోహార్కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతలా ఓపెన్గానే విమర్శించుకుంటారు వీరిద్దరూ. ఇప్పుడు వీరిద్దరి మధ్య అంతా సర్దుకుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. తనకు ఎమెర్జెన్సీ సినిమాను రూపొందించాలని ఉండేదని, ఇప్పుడు తెరకెక్కుతున్న ఆ సినిమాను చూడాలని ఉందని కరణ్ జోహార్ తెలిపారు.
ఈ సినిమాలో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ రోల్ చేస్తున్నారు కంగన రనౌత్. ఆ మధ్య విడుదలైన టీజర్కి చాలా మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ఇప్పుడు కరణ్ జోహార్ ఆ మాట చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఐశ్వర్యరాయ్తో మంచి బయోపిక్ చేయాలని ఉందని అన్నారు కరణ్జోహార్. ఆయన మాట్లాడుతూ ``నీతా అంబానీ బయోపిక్ చేస్తే ఐశ్వర్యరాయ్ నటిస్తే బావుంటుంది. అలాగే సుకేష్ చంద్రశేఖర్ రోల్ కి పంకజ్ త్రిపాఠి సరిపోతారు. నరేంద్రమోడీ రోల్లో అమితాబ్ బచ్చన్ని చూడాలని ఉంది. రాహుల్ గాంధీ కేరక్టర్కి రణ్బీర్ కపూర్ సరిపోతారు. విరాట్ కోహ్లీ బయోపిక్లో విక్కీ కౌశల్ అద్భుతంగా సెట్ అవుతారు`` అని అన్నారు.
