Read more!

English | Telugu

మొత్తానికి రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌ అయింది.. కంగనా ఆశ నెరవేరేనా?

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ అనిపించుకుంటున్న కంగనా రనౌత్‌ తన ప్రతి సినిమాకీ ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంది. ఆమధ్య మణికర్ణిక విషయంలో చాలా వివాదాలు వచ్చాయి. అన్నింటినీ అధిగమించి సినిమాను రిలీజ్‌ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ కూడా చిక్కుల్లో పడిరది. ఈ సినిమాను ఇప్పటికే రెండు, మూడు సార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌ అయిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కంగనా స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ‘ఇండియా చీకటి రోజుల వెనుక స్టోరీని చూడండి.. జూన్‌ 14న ‘ఎమర్జెన్సీ’ రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా నాకు చాలా ప్రతిష్టాత్మకమైంది. ‘మణికర్ణిక’ తర్వాత నేను డైరెక్ట్‌ చేసిన సినిమా. ఈ సినిమా కోసం ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ టెక్నీషియన్స్‌ పనిచేశారు’ అంటూ పోస్ట్‌ చేసింది. 

వాస్తవానికి నవంబర్‌ 24న ఈ సినిమా రిలీజ్‌ అవ్వాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడిరది. ఈమధ్య కాలంలో తన సినిమాలతో ఉనికిని కాపాడుకోలేకపోతున్న కంగనా ఆశలన్నీ ‘ఎమర్జెన్సీ’పైనే పెట్టుకుంది. ఈ సినిమా కోసం తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టింది. అంతేకాదు, ఇందిరాగాంధీ పాత్రలో నటించింది.