English | Telugu
మొన్న షారుఖ్... ఇప్పుడు జాక్వలిన్..!
Updated : Jan 5, 2023
మొన్న షారుఖ్ చేసిన పనినే, ఇప్పుడు జాక్వలిన్ కూడా చేశారు. వైష్ణో దేవి టెంపుల్ని సందర్శించుకున్నారు. వైష్ణో మాతని జాక్వలిన్ దర్శించుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి, మాజీ మిస్ శ్రీలంక జాక్వలిన్కి కాస్త భక్తి ఎక్కువే. జమ్ము కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఆమె వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే విషయాన్ని సీక్రెట్గా ఉంచారు. వెళ్తున్నప్పుడు అక్కడ కనిపించిన భక్తులను ఆప్యాయంగా పలకరించారు. వైట్ టాప్, పాంట్స్, బాంబర్ జాకెట్ తో సింపుల్గా కనిపించారు జాక్వలిన్.
సుఖేష్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ పలుమార్లు సమ్మన్లు జారీ చేసింది. సుఖేష్ నుంచి కాస్ట్ లీ గిఫ్ట్ లు జాక్వలిన్కి అందాయన్నది ఫిర్యాదు. అక్షయ్కుమార్ 'రామ్ సేతు'లోనూ, రణ్వీర్ సింగ్ 'సర్కస్'లోనూ కనిపించారు జాక్వలిన్. 'సాహో'లో ప్రభాస్ పక్కన "బేబీ ఐ యామ్ బ్యాడ్ బోయ్" అనే స్పెషల్ సాంగులో స్టెప్పులేశారు.
రీసెంట్గా వైష్ణో దేవి ఆలయాన్ని షారుఖ్ ఖాన్ కూడా సందర్శించారు. 'పఠాన్' సినిమా షూటింగ్ పూర్తికాగానే షారుఖ్ ఆ ఆలయానికి వెళ్లారు. ఎవరూ తనని గుర్తుపట్టకుండా డ్రస్ చేసుకున్నారు షారుఖ్. అయితే ఆయన బౌన్సర్ల మూలంగా అక్కడి భక్తులు షారుఖ్ని గుర్తుపట్టారు. షారుఖ్ నటించిన 'పఠాన్' జనవరి 25న విడుదల కానుంది. దాదాపు 10 కట్స్ చెప్పి సెన్సార్ చేశారు అధికారులు. "బేషరమ్" పాటలో క్లోజ్ షాట్స్ వాడకూడదని సూచించారని వినికిడి.