English | Telugu

హిందీ 'ఛ‌త్ర‌ప‌తి' స‌ర‌స‌న దిశా ప‌టాని!

టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ఛత్ర‌ప‌తి'.. హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ బాలీవుడ్ ఎంట్రీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాతోనే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ కూడా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ షురూ కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సాయిశ్రీ‌నివాస్ తో జ‌ట్టుక‌ట్టే నాయిక గురించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అన‌న్యా పాండేతో స‌హా ప‌లువురు బాలీవుడ్ భామ‌ల పేర్లను ఈ రీమేక్ తో ముడిపెట్టారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో బెల్లంకొండ‌కి జోడీగా హాట్ బ్యూటీ దిశా ప‌టానిని ఎంపిక చేశార‌ట‌. అంతేకాదు.. ఈ పాత్ర కోసం భారీ మొత్త‌మే అమ్మ‌డు పుచ్చుకోనుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ లో దిశా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. సాయిశ్రీ‌నివాస్, దిశాప‌టాని జంట కాసుల పంట పండిస్తుందేమో చూడాలి. ఈ ఏడాది చివ‌ర‌లో 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.