English | Telugu
'బ్రహ్మాస్త్ర 2'లో డైలాగ్స్ బెటర్గా ఉంటాయి.. మాటిచ్చిన డైరెక్టర్!
Updated : Sep 26, 2022
రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ' బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు తగ్గట్లే వసూళ్లను రాబడుతోంది. తెలుగు వెర్షన్ అయితే రెండు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించేసింది. ప్రధానంగా ఆ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, షారుక్ ఖాన్, నాగార్జున పవర్ఫుల్ గెస్ట్ రోల్స్ ఆడియెన్స్ను బాగా అలరిస్తున్నాయి. అయితే ఈ ఫాంటసీ యాక్షన్ లవ్ స్టోరీలో డైలాగ్స్ ఘోరంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. వాటిపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. కాగా క్లైమాక్స్లో ఈ మూవీ సీక్వెల్ టైటిల్ను 'బ్రహ్మాస్ట్ర పార్ట్ 2: దేవ్' అని రివీల్ చేసిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. అందులో డైలాగ్స్ బెటర్గా ఉంటాయని మాటిస్తున్నాడు.
ఇటీవలి కాలంలో అత్యధికులు ఆసక్తిగా ఎదురుచూసిన బాలీవుడ్ ఫిలిమ్స్లో ఒకటైన 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న విడుదలైంది. స్టార్ స్టూడియోస్ యూట్యూబ్ చానల్లో బ్రహ్మాస్త్ర ఫ్యాన్ థీరీస్ను మూడు వీడియోల ద్వారా అయాన్ డిస్కస్ చేశాడు. అందులోని మూడో వీడియోలో, రెండో భాగం తనకో పెద్ద ఛాలెంజ్ కానున్నదని తెలిపాడు.
మూడు భాగాల సిరీస్లో రెండోది ఎందుకని ఆలస్యంగా రానున్నదనే ప్రశ్నకు 'బాహుబలి'ని ఉదాహరణగా ప్రస్తావించాడు. "రాజమౌళి తీసిన 'బాహుబలి'ని తీసుకోండి. మొదటిది వచ్చిన రెండేళ్ల తర్వాతనే రెండో భాగం వచ్చింది. మనది చాలా పెద్ద దేశం. 'బ్రహ్మాస్త్ర'ను అందరూ చూడ్డానికే ఆర్నెల్ల సమయం పడుతుందని అనుకుంటున్నా. 'బ్రహ్మాస్త్ర 2'ను వచ్చే ఏడాదికల్లా ఇవ్వగలిగితే అదే గొప్ప విషయం. కానీ పార్ట్ 2ను మరో రెండు మూడేళ్లకల్లా రెడీ చెయ్యడం అనేది కూడా అతి పెద్ద ఛాలెంజ్ మాకు. ఎందుకంటే ఇది పూర్తిగా మేడిన్ ఇండియా ప్రొడక్ట్." అని చెప్పుకొచ్చాడు.