English | Telugu
ఆలియా-రణబీర్ పెళ్లికి అతిథులు 28 మంది!
Updated : Apr 12, 2022
ఆలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి చుట్టూ ఉన్న ఎగ్జయిట్మెంట్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. వారి పెళ్లి ఎప్పుడనేది ఇంతదాకా అఫిషియల్గా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 13, 14, 15.. ఇలా రకరకాల తేదీలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇవేవీ కావు, ఏప్రిల్ 20న వారి పెళ్లి జరగనుందంటూ ప్రచారంలోకి వచ్చింది. ఆలియా సోదరుడు రాహుల్ భట్ ఈ కొత్త తేదీని బయటపెట్టాడు. ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్తో మాట్లాడిన అతను, "ఆలియా, రణబీర్ పెళ్లి జరగనున్నదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఏప్రిల్ 13 లేదా 14న పెళ్లి జరగటం లేదు. త్వరలోనే పెళ్లి తేదీని అనౌన్స్ చేయబోతున్నారు" అని అతను తెలిపాడు. ఇదే సందర్భంగా ఏప్రిల్ 20న వారి పెళ్లి జరగనున్నట్లు అతను వెల్లడించాడు.
పెళ్లి పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. రణబీర్ కపూర్ ఇల్లు కృష్ణరాజ్ బంగళాను ఇప్పటికే విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులైన 28 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఆలియా, రణబీర్ పెళ్లిపై బాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. సంజయ్ దత్ అయితే తన ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేకపోయాడు.
ఆయన బయోపిక్ 'సంజు'లో నటించింది రణబీర్ అనే విషయం తెలిసిందే. "అతను పెళ్లిచేసుకోట్లయితే, నేను చాలా హ్యాపీ ఫీలవుతాను. ఆలియా నా కళ్ల ముందే పుట్టి పెరిగిన అమ్మాయి. మ్యారేజ్ అనేది పరస్పరం తోడునీడగా ఉండే ఒక కమిట్మెంట్. పెళ్లితో ఆ ఇద్దరూ సంతోషంగా ఉంటారని ఆశిస్తాను" అని సంజు చెప్పాడు.